చంపాపేట టీడీపీ కార్పోరేట్ర్పై మర్డర్ కేసు
హైదరాబాద్: చంపాపేట కార్పోరేటర్ సామ రమణారెడ్డిపై హత్య కేసు నమోదైంది. ఏడేళ్ల క్రితం నర్సింగ్రావు అనుమానాస్పద మృతికి సంబంధించి కార్పోరేటర్తో సహా మరో ఇద్దరిపై నమోదైన హత్య కేసును పోలీసులు తిరిగి తెరిచారు. మద్యం మత్తులో నర్సింగ్రావు బిల్డింగ్పై నుంచి పడిపోయినట్లు పోలీసులు నిర్ధారించి కేసును మూసి వేశారు. కాగా పోలీసు దర్యాప్తు వివరాలతో ఫోరెనిక్స్ సభ్యులు అప్పట్లోనే విభేదించారు. నర్సింగ్రావు కుటుంబం చంపాపేట కార్పోరేటర్పై అనుమానం వ్యక్తం చేస్తూ పదే పదే పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. దీంతో వారు కోర్టును ఆశ్రయించారు.
No comments:
Post a Comment