Friday 26 April 2013

తెనాలి ఘటనపై డీజీపీకి ఎన్‌హెచ్‌ఆర్సీ నోటీసులు

కుమార్తెను లైంగిక వేధింపుల నుంచి రక్షించుకునే ప్రయత్నంలో గుంటూరు జిల్లా తెనాలికి చెందిన బెతాన సునీల.. ప్రాణాలు కోల్పోయిన ఘటన పై జాతీయ మానవ హక్కుల కమిషన్(ఎన్‌హెచ్‌ఆర్సీ) తీవ్రంగా స్పందించింది. ఈ ఘటనపై పత్రికల్లో వచ్చిన కథనాలను సుమోటోగా విచారణకు స్వీకరించిన కమిషన్.. ఆంధ్రప్రదేశ్ డీజీపీ, గుంటూరు జిల్లా ఎస్పీలకు శుక్రవారం నోటీసులు జారీచేసింది. నాలుగు వారాల్లోగా లిఖితపూర్వక సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. కుమార్తెపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న తాగుబోతులను సునీల నెట్టివేయడంతో వారు ఆమెను లారీ కిందకు తోసి చంపిన సంగతి తెలిసిందే. 

No comments:

Post a Comment